Thursday, June 7, 2012

ధర్మవరపు నిజజోకులు

ఈమధ్య ఏదో టి.వి  షోలో ధర్మవరపు సుభ్రమణ్యం (డి.ఎస్) తన నిజజీవితంలో జరిగిన కొన్ని హాస్యసన్నివేశాలు  వివరించాడు.
నాకు గుర్తున్న రెండు...
                                               ఒకసారి డి.ఎస్  ట్రైన్లో ఒంగోలు నుంచి హైదరాబాద్ రాత్రి సమయంలో ప్రయాణం చేయాల్సి వచ్చిందట. ట్రైన్  ఎక్కే సమయానికే ట్రైన్లో లైట్స్ ఆపేసి అందరూ నిద్రపోతున్నారట. తన ఎదురు సీట్లో కూర్చున్న వ్యక్తి మాత్రం నిద్రపోకుండా ఈయన వచ్చి కూర్చోగానే, సర్ నాకు నిద్రపడితే తెల్లవారితే తప్ప మధ్యలో మెలకువరాదు. నేను చాల అవసరమైన కోర్టుపనీమీద గుంటూరు వెళ్తున్నాను, సరైన సమయంకి వెళ్ళకపోతే చాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సివుంటుంది. నన్ను మీరు నిద్రలేపుతాను అని భరోసా ఇస్తే పడుకుంటాను అని అభ్యర్దిన చేసుకుంటే దానిదేముందండి నేను మెలకువగానే వుంటాను తప్పక లేపుతాను మీరు నిశ్చింతగా పడుకోండిఅని అభయహస్తం ఇచ్చి మన డి.ఎస్ గారు కూడా పడుకున్నారట. సికింద్రాబాద్ స్టేషన్ రాగానే తన ఎదురు ఫై బెర్తులో వ్యకి దిగి నన్ను ముంచేశావు కదయ్య అని తిట్టటం మొదలెట్టాడట. మన  డి.ఎస్ గారు ఆశ్యర్యంగా చూస్తుంటే తిడుతున్నా మొద్దులా అల చూస్తావే అని ఉక్రోషంగా అనేసరికి,  నువ్వే ఇలా తిడుతుంటే గుంటూరులో ఈ  సీట్లో నిద్రపోతుంటే  నేను బలవంతంగా ట్రైన్ దించేసిన వ్యక్తి ఎలా తిట్టుకున్తుంటూఉంటాడో అన్నారట :)

                                              మన  డి.ఎస్ గారి ఏరియా పోష్టుమాన్ అయ్యా మీ చిన్న కొడుకుని బయటకి పంపకండి అని బ్రతిమిలాడుకున్నాడట.  ఏమైందండీ అంటే, మీ వాడు (వీధి చివర  ఉండే) పోస్టాఫీస్  కి నాలుగు రోజులకి ఒకసారి వచ్చి ఒక ఎన్వోలోప్ ఎంత ? కార్డు ఎంత? 4 కార్డులు, 3 ఎన్వోలోప్ లు ఎంత? ఒక వేళ కార్డు విలువ ఇంత, ఎన్వోలోప్ విలువ ఇంత ఐతే ఎంత అవుతాయి, ఇన్ని కొని కొన్ని తిరిగిచ్చేస్తే ఎంత డబ్బులు వాపసు వస్తాయి  అని విసిగిస్తున్నాడు అని వాపోయాడట. విషయం ఏమిటంటే తరగతిలో మనవాడికి హోమేవోర్క్ ఇస్తే అది పోష్టుమాన్ చేత చేయిస్తున్నాడు జూ. డి. స్.

No comments:

Post a Comment